Monday, February 26, 2007

ప్రేమంటే.....

ప్రేమంటే- స్మృతియా?
ప్రేమంటే- అనుభూతులా?
ప్రేమంటే- ఆధారపడడమా?
ప్రేమంటే- దాస్యతా?
ప్రేమంటే- ఆరాధనా?

యీల చాల అనుబంధాలు ప్రేమ లో మిళితమయ్యాయి.

అన్నిటికంటే ముఖ్యమైంది,ప్రేమంటే స్వచ్చత, నూతనమైనది, పవిత్రమైంది.ప్రేమలో విధ్వంసం ఉండదు.ప్రేమను,ఇంటిలో పెంచుకునే మొక్కలా సమ్రక్షించుకోవాలి.

Monday, February 19, 2007

పాత్ర - విశిష్టత

సీతమ్మతల్లి లో నిగూఢమైన ఆదర్శాలు ఎన్ని
యుగాలైనా మనకు పూజ్యనీయం.

రాముడి వెంట అడవులకు వెళ్లిన సీత, భర్త ఆదర్శాన్ని ఆకళింపుచేసుకుని, దాని విలువ తేల్సుకుని అనుసరించిన ప్రఙ్ఞావంతురాలు.

బంగారులేడిని అడగడం లో తన ముచ్చటను,చనువును,స్త్రీ సహజధోరణి బయట పెట్టింది.

బ్రాహ్మణుడికి భిక్ష పెట్టడం లో, ధర్మశీలిగా , పేదబ్రాహ్మణుడికి ఆకలి తీర్చడమే ముఖ్యమైనదని నమ్మిన దాయాగుణం కనపడతాయి.

రావణాసురిడి దగ్గర తన్ను తాను రక్షించుకొవడంలో ఆమె ఆత్మస్థైర్యం కనపడుతంది.

ఆగ్నిప్రవేశం ద్వార పవిత్రత,అన్నిటికంటే ముఖ్యమైనది తెలిపింది.

నిండు గర్భినిని కఠోరంగా రాముడు(ఎంతటి బలమైన ఉద్ద్యేశం ఉన్నా) అడవులకు పంపినా,ఇసుమంతైన కోపం కనిపించక శాంతంగా కర్తవ్యపాలన చేసింది.

ఎన్ని కష్టాలు పడినా లవకుశలకు తండ్రి మీద ఉన్న గౌరవం ఆమె ఉన్నత పెంపకానికి నిదర్శనం.

ఇక ఆఖరున భూమిలో కల్సి పోవడం,ఆమె ఆత్మగౌరవం చక్కగా ప్రకిటతమవుతుంది.

ఇంకాఎన్నో ఔదార్యాలు గల సహనశీలి సీత. ఇదీ సీతలోని మహోన్నత.

సీతారాములు నిజంగానే ఆదర్శదంపతులు. రాముడి కీర్తి పైకి ప్రకటితమైతే, సీత గొప్పతనం మన అంతరాళ్లలో మిళితమైంది. మనం గమనించాల్సింది ఆ పాత్రలు,పరిస్థితులు కాదు.ఇద్దరి ప్రేమ,నమ్మకం,అవగహన.

సహజంగా సీత కష్టాల్ని స్త్రీలు తెరిపార తేల్సుకేవడానికి,తలవడానికి భయపడ్తారు. అందుకేనేమో శ్రీ స్వామి వివేకనంద చేప్పారు "రాముడి లాంటి పురుషులు పలువురు ఉండవచ్చునేమో గాని సీతవంటి మహిళ లేనేలేదు. కలతి లేని భారతీయ మహిళకు ఆమే సరైన లక్ష్యం."

"స్త్రీలను నవ్యపద్ధుతులకు తెచ్చే ప్రయత్నంలో వారు ఆ సీతాదర్శానికి ఎడసి పోవలసి వస్తే,ఆ ప్రయత్నం వెంటనే భంగపడుతుందని అనటం మనం ప్రతిరోజు చూస్తున్నాం. భారతీయ మహిళలు పెంపొందటానికి, శ్రేయస్సు గాంచటానికి సేతామార్గాన్ని ఒక్కదాన్నే అనుసరించాలి, వేరే మార్గం లేదు."

ఇది ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం యిందులో ఎంత నిజమున్నదో గమనించాలి. ఏది ఆదర్శంగా తీసుకోమని కాదు ఉద్ధేశ్యం. మన 'దేశం ఆదర్శం' మనకు తెలియడం ద్వార మనకు ఎదురయ్యే పరిస్ఠులను ఎదుర్కోనే సామర్ధత, నిభ్భరం మనలో కల్గుతాయని నా నమ్మకం.

"స్త్రీ ల బాహ్యరూపాలు యింద్రియాలకు ఆకర్షణ కల్గించి పురుషులను పిచ్చివారిని చేశాయి.కాని ఙ్ఞానం, భక్తి వివేకవైరాగ్యాలైన వారి ఆంతరరూపాలు మానవుడు దర్శిస్తే అతడు సర్వఙ్ఞుడు, ఆమోఘసంకల్పుడు,బ్రహ్మఙ్ఞాని అవుతాడు." (శ్రీ స్వామి వివేకనంద)

స్త్రీ సహజధోరణి నుండి బయట పడి నిజతత్వాన్ని గమనించల్గితే చాల చికాకులు తప్పుతాయి.
'సలహాలు యివ్వడమే
పనిగా పెట్టుకున్నాననుకోకు లోకమా
జీవిత అవగాహనా అనే లోగిలిలో అడుగిడి
చాల ఏళ్లే అయ్యింది
తెల్సింది పంచుకోవడం లోని
ఆనందం వేరు కదా నేస్తమా!'

Friday, February 16, 2007

ప్రేమ పూరితమైన నవ్యసమాజాన్ని మనమే నిర్మించగలమా??

ఎంతటి బలమైన,అర్ధవంతమైన ప్రాంతీయవాదమైన,జాతీయవాదమైన మానవతావాదం కి మించినదికాదు.మన బ్లాగులో ప్రాంతీయవాదంగూర్చిన చర్చలు కలవరపెట్టాయి.ఆవాదనలో తప్పోప్పు కాదు మనకు కావల్సింది.ఈవాదనలతో మనకు మనము పరాయిభావన్ని ఎక్కువగా చేసుకుంటున్నామా అనే అలజడి కల్గింది.
అనుకోకుండా ఏదైన నిప్పు అంటుకుంటే వెంటనే ఆర్పడానికి ప్రయత్నిస్తాము.చర్య వెంటనే ఉంటుంది.ఎందుకంటే అది ఎంత ప్రమాదమొ మనకు తెల్సు.ఉపయోగంలేదని తేల్సినా మరి ఈ వాదనల్ని ఆపుచేయలేము!మనకు కావల్సింది కాలక్షేపం,ఎవరికివారు నాపద్దతి,నావాదన గొప్పది అని నిరూపించుకోవాలని తాపత్రయం.
J.కృష్ణమూర్తిగారు చెప్పినట్లు, "మనం నివసిస్తున్న ఈ పరిసరాల నుంచీ,ఈ బాంధవ్యాల నుంచి,ఈ ప్రపంచం నుంచీ ఎక్కడికో పారిపోవడం కాదు.ఇక్కడే వుండి,ఈక్షణంలోనే ఈ సమస్యలను అవగాహన చేసుకొని,స్వేచ్ఛగల మనుష్యులై బ్రతకడం సాధ్యమా??"
నాకు ప్రత్యేకించి ఏ ఙ్ఞానం లేదు.అయితే నా చర్యల్ని,చుట్టూ జరిగే చర్యల్ని గమనిస్తూ,అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.ఇలా ఎరుకలో ఉండడం వలన మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశముంది.ఎందుకంటే మనల్ని ఏ మోసపు వాదనలు నమ్మించేట్లు చేయలేవు.నేను ఇంకా అంత బాగా వివరించే స్థాయికి ఎదగలేదనుకుంటా.
మనస్పూర్వకంగా ప్రేమపూరితమైన నవ్య సమాజాన్ని నిర్మించుకునే శక్తిని మనకు యివ్వామని దేవున్ని ప్రార్థిస్తూ....

Thursday, February 15, 2007

మానవతా సంభందాల పై నా అవగాహన, ఎరుక, ఆవేదన.....


మానవతా సంభందాలు మెరుగు పడడం ఎలా?? అనే అంశం అందరి దృష్టి లో కి రావాలని, ఈ అంశం ఎరుకలోకి రావాలని నా ఆత్రుత. ఈ విషయం పై నేను ఏదో సలహా యివ్వాలని కాదు. ఈ విషయం ఎవరికి వారు శోధించఢం, గమనించడం ద్వార మన భాంధవ్యాలు మెరుగనపడగలవని నా నమ్మకం.

కుటుంభంలోని వ్యక్తులు, మిత్రులు, చుట్టూ గల సమాజం తో మనకు గల సంభందాలు తృప్తి కరంగా ఉన్నాయా?? మన మధ్య సంభందాలు పుష్టికరంగా లేకపోతే మనలో మిగిలేది అశాంతి,ఘర్షణ,వైరము లాంటి వ్యతిరేకభావలు. ఇవన్ని వ్యక్తి శక్తిని నశింపచేస్తాయి. ఇందులోనుండి బయటపడం ఎలా??

ఇలాగనే ఎంత పురోగమనం సాధించినా, స్వీయఙ్ఞానం లేకుండా నిజమైన,గంభీరమైన చర్యను దేనిని చేపట్టినా పునాది వుండదు,ఆధారముండదు. స్పష్టమైనదానిని నిర్మించాలంటే ఒక ఆధారముండి తీరాలి. తనను తాను తెలుసుకోకపోతే మనము కృత్రిమ జీవితాన్ని జీవిస్తాము.

మన ఉహాస్థితిలోని ఇతరుల వ్యక్తిత్వము నిజము కాదు. వారు ఉంటున్నదే నిజము. దీనిని స్వీకరించడమే సరైన మార్గము.

ఇలాంటి విషయాల గురించి జిడ్డు క్రిష్ణమూర్తి ప్రసంగాలు అవగాహన కలిగిస్తాయి.

" ప్రపంచం మొత్తం నీలోఉన్నది.
ఎలాచూడాలో గ్రహించాలో తెలిస్తే
తలుపక్కడే ఉన్నది. భూమి మీద
ఉన్న ఏ ఒక్కరూ నీకా తాళం చెవినీ
యివ్వలేరు, తెలుపూ తెరువలేరు
నీవు తప్ప!"